మామిడికాయ చేపలు
కూర

మిరియాలపొడి - పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, నీరు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత.తయారుచేసే విధానం : చేపని అంగుళం ‘క్యూబ్’లుగా కోసి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, ఉల్లితరుగు, 4 రెబ్బల కరివేపాకు, ధనియాలపొడి, మిరియాలపొడి, పసుపును అరకప్పు నీటితో పేస్టులా గ్రైండు చేసుకోవాలి. కడాయిలో పేస్టుని వేసి మిగిలిన అరకప్పు నీరు, చేపముక్కలు వేసి ఉడికించాలి. చేప సగం ఉడికిన తర్వాత మామిడి ముక్కలు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సన్నని మంటమీద ఉడికించి దించేయాలి. నూనెలేకుండా చేసుకునే ఈ చేపలకూర వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment