'వియ్'ని
ప్రారంభించిన మంచు లక్ష్మి 

హైదరాబాద్: ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళా సాధికారత సాధ్యమని సినీ నటి మంచు లక్ష్మి సోమవారం నాడు అన్నారు. తాజ్ డెక్కన్లో ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ను (వియ్) ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర కూడా పాల్గొన్నారు.
సదస్సులో మంచు లక్ష్మి
మాట్లాడుతూ... స్త్రీల సాధికారతను పెంచుకునే క్రమంలో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని
నిలబడి, అన్ని రంగాల్లో ముందుకు పోవాలన్నారు.
జగదీశ్వర మాట్లాడుతూ... విద్యా సంస్థల్లో మహిళలకు అనేక ఉపాధి అవకాశాలున్నాయన్నారు. వియ్ ఇన్ ఎడ్యుకేషన్ జాతీయ బాధ్యురాలు వాసవి భరత్ రామ్ మాట్లాడుతూ ఫిక్కి మహిళల భద్రత, ఉపాధి అవకాశాల లక్ష్యంతో వియ్ ఇన్ ఎడ్యుకేషన్ని ప్రారంభించిందన్నారు.
No comments:
Post a Comment